అసెంబ్లీకి హాజరైన వల్లభనేని వంశీ.. ఎక్కడ కూర్చున్నారంటే..!

Update: 2019-12-09 06:06 GMT
వల్లభనేని వంశీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యారు. ఆయన టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేయడం ఇటు వైసీపీలో చేరకపోవడంతో అటు ఇటు కాకుండా టీడీపీ సభ్యులు కూర్చున్న వెనుకవైపు బెంచీలో కూర్చున్నారు. తాను త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే తన పయనమని వంశీ ఇదివరకే ప్రకటించారు.  

Tags:    

Similar News