జగన్ కి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే

Update: 2019-10-18 14:26 GMT

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ ప్రభుత్వం ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో పధకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఈ పధకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏలూరులో ప్రారంభించారు. ఇప్పుడు ఈ పధకానికి మంచి స్పందన వస్తుంది. ఈ పధకాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభినందించారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయన మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీరు ఖాకీ చొక్కాలు ధరించడం విశేషం.. 

Tags:    

Similar News