మండలి నిర్ణయంపై తీవ్రంగా సమీక్షిస్తున్న ప్రభుత్వం

Update: 2020-01-23 11:03 GMT

ప్రతిష్టాత్మకంగా భావించిన బిల్లుల విషయంలో శాసనమండలి ఛైర్మెన్‌ తీసుకున్న నిర్ణయంపై సర్కారు తీవ్రంగా సమీక్షిస్తోంది. తమ ముందున్న ఆప్షన్స్‌ ఏంటి..? ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనే దానిపై మంత్రులు చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను మరికొన్ని రోజులు పొడగించాలా..? మండలిని కూడా హాజరుపర్చాలా..? అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏదైనా నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు. లేకపోతే వచ్చే మూడు రోజుల్లో ఏదో నిర్ణయం తీసుకుని సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వ్యూహం ప్రకటిస్తారని తెలుస్తోంది. 

Tags:    

Similar News