శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిరి వాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి సీఎం జగన్ హాజరైయారు.

Update: 2020-02-03 07:03 GMT
శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిరి వాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి సీఎం జగన్ హాజరైయారు. పూర్ణకుంభంతో వేద పండితులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్న సీఎం జగన్ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. శారదాపీఠం ప్రాంగణంలో గోమాతకు పూజలు చేశారు.

శారదా పీఠం వార్షిక మహోత్సవం సందర్భంగా విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి చేపట్టారు. మహాపూర్ణాహుతిలో సీఎం జగన్ పాల్గొన్నారు. స్వయం జ్యోతి మండపాన్ని ప్రారంభించారు. సీఎం హోదాలో శారదాపీఠానికి జగన్ రావడం ఇది రెండో సారి. 

Tags:    

Similar News