రెండో రోజు కూడా అమరావతిలో కొనసాగుతోన్న బంద్

రాజధానిలో కొంత భాగాన్ని అమరావతి నుండి తరలించడాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంత భూయజమానులు బుధవారం వరుసగా రెండో రోజు కూడా బంద్ కొనసాగిస్తున్నారు.

Update: 2020-01-22 05:50 GMT

రాజధానిలో కొంత భాగాన్ని అమరావతి నుండి తరలించడాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంత భూయజమానులు బుధవారం వరుసగా రెండో రోజు కూడా బంద్ కొనసాగిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనను ముమ్మరం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెలగపూడి, కృష్ణయపాలెం గ్రామాల్లో రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. విద్యార్థి సంఘాలు పాఠశాల, కళాశాల బస్సులను ఆయా గమ్యస్థానాలకు వెళ్లకుండా నిలిపివేసాయి. పోలీసు చర్యలపై కోపంగా ఉన్న టీడీపీ నాయకులు పోలీసులతో గొడవ పడ్డారు. ఇది టీడీపీ నాయకుడు డిఎస్పి సీతారామయ్య కాలర్ పట్టుకోవటానికి దారితీసింది.

చికాకు పడిన పోలీసులు టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు, బంద్‌కు అనుమతి లేదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని పోలీసులు కఠినమైన హెచ్చరికలు ఇస్తున్నారు. గుందూరు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు బంద్ కారణంగా ఇబ్బనాధులు పడుతున్నారని బంద్ ను ఉపసంహరించుకోవాలని పోలీసులు జెఎసిని కోరారు. దుకాణదారులను తమ వ్యాపారాలను మూసివేసి బంద్ ను ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News