లారీని ఢీ కొట్టిన బస్సు.. 22 మందికి తీవ్ర గాయాలు

నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2020-01-18 06:42 GMT

నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికుల్లో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి, ఇందులో 18 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు. ప్రమాదం జరిగిందని గమనించిన స్థానికులు వెంటనే బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు.

వారిని మనుబోలు ఆసుపత్రికి తరలించారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరికొందరిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు బెంగళూరు నుండి వస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  

Tags:    

Similar News