సీజనల్ వ్యాధులపై అవగాహన

మండలంలోని వశిష్ట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వై వి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.

Update: 2019-12-18 03:59 GMT
ప్రిన్సిపాల్ వై వి సుబ్రహ్మణ్యం

ఇందుకూరుపేట: మండలంలోని వశిష్ట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వై వి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు గురించి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమల వలన వచ్చే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మొదలగు వ్యాధులు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తెలిపారు.

విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు ఇరుగుపొరుగు వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి చారిటబుల్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, సెక్రటరీ కృష్ణకుమారి హోమియో సిబ్బంది కళాశాల సిబ్బంది జానకి వెంకటేశ్వర్లు, అశోక్ సురేంద్రబాబు, రవీంద్ర సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News