జేసీకి జగన్ సర్కార్ ఝలక్‌

Update: 2020-02-01 08:36 GMT

జేసీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గతంలో కేటాయించిన సున్నపురాతి గనుల లీజులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబర్ 22 బీ లోని 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపురాతి గనుల లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

త్రిషూల్‌ ప్లాంట్ నిర్మాణానికి ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడనందునే ఈ రద్దు నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు పేర్కొంది. అయితే లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.


Full View

 

Tags:    

Similar News