పవన్‌ మేకప్‌ ఉంటే హీరో.. లేకపోతే జీరో : ఆమంచి

Update: 2019-11-04 07:51 GMT

టీడీపీ, జనసేనపై వైసీపీ సీనియర్‌ నేత ఆమంచి కృష్ణమోహన్‌ మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఇసుక మాఫియా జరిగింది కాబట్టే పకడ్బందీ ఇసుక పాలసీ తెచ్చామన్నారు‌. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందన్న ఆయన కార్మికులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనన్నారు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత ప్రతీ వినియోగదారుడికి కూడా ప్రభుత్వం ఇసుక అందిస్తుందని స్పష్టం చేశారు. పవన్‌ మేకప్‌ ఉంటే హీరో లేకపోతే జీరో అని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్‌ ఏం త్యాగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News