45 కేజీల గంజాయి పట్టివేత

మండల పరిధిలోగల చిన్నగెడ్డ గ్రామంలో 45 కేజీల గంజాయిని ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Update: 2019-11-27 07:32 GMT
ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న గంజాయి

చింతపల్లి: మండల పరిధిలోగల చిన్నగెడ్డ గ్రామంలో 45 కేజీల గంజాయిని ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. చిన్నగెడ్డ గ్రామంలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో అక్కడికి వెళ్ళగా మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి బ్యాగులతో ఉన్నారు.

వారి వద్ద నుంచి 45 కేజీల గంజాయిని, సెల్ ఫోన్ ని, వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల ఆకాష్ కుచవడియా ఠాకూర్, సరోజ్ కుచవడియా ఠాకూర్, వందన కుచవడియా ఠాకూర్, వీరు ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రం, రైజన్ జిల్లా, ఒబెడులగంజ్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. ఈ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని తెలిపారు. 


Tags:    

Similar News