YV Subba Reddy: ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
YV Subba Reddy: న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
YV Subba Reddy: వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధాని వచ్చేంత వరకు హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందన్నారు. గత ప్రభుత్వం కూడా తాత్కాలిక రాజధానిని నిర్మించారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక... విశాఖను పరిపాలనా రాజధానిగా అనుకున్నామన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న వైవీ సుబ్బారెడ్డి.. ఎన్నికల తర్వాత జగన్ దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందన్నారు.