Telangana: నీటిపారుదల రంగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Telangana: మంత్రివర్గ ఉప సంఘం ఆగష్టు 9న తొలిసారి సమావేశం
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణలోని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం, పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో నీటిపారుదల రంగా అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కేబినెట్ సబ్ కమిటీలో.. మంత్రులు సహా అధికారులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఆగష్టు 9న తొలిసారి సమావేశం కానుంది. రాష్ట్రంలోని జలాశయాలు.. వాటి పరిస్థితి, పుణరుద్దరణ అంశాలపై పరిశీలన చేసి సిఫారసులు చేయనుంది.