Siddipet: హుస్నాబాద్ కాంగ్రెస్లో ‘‘టికెట్’’ రచ్చ.. కొట్టుకున్న పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వర్గీయులు
Siddipet: ప్రచార ర్యాలీలో కొట్టుకున్న ఇరువర్గాల కార్యకర్తలు
Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. పథకాల గ్యారెంటీ కార్డ్స్తో సీడబ్ల్యూసీ సభ్యుడు మోహన్ ప్రకాష్తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పట్టణంలో ప్రచార ర్యాలీ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వర్గీయులు, ప్రవీణ్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా రెచ్చిపోయి నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. హుస్నాబాద్ శాసనసభ స్థానం నుండి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
అప్పటి నుండి ఇరువురు నాయకులతో పాటు ఇరువర్గాల మధ్య అంతర్గతంగా వివాదం కొనసాగుతుండగా, ఈ వివాదం నేడు బయటపడింది. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఓ వైపు ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగానే మరో వైపు కాంగ్రెస్ నాయకులు ప్రచార ర్యాలీ నిర్వహించారు.