T20 World Cup 2024 : రూ.16.60 లక్షలు చెల్లిస్తేనే భారత్, పాక్ మ్యాచ్ చూడొచ్చు

జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్

Update: 2024-05-24 10:27 GMT

T20 World Cup 2024 : రూ.16.60 లక్షలు చెల్లిస్తేనే భారత్, పాక్ మ్యాచ్ చూడొచ్చు

T20 World Cup 2024 : IPL సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మళ్లీ వచ్చే నెల 2 నుంచి టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్ లు సందడి చేయనున్నాయి. అమెరికా వేదికగా ఈమ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యా చ్ లకైతే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లు ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లకు మందికి పైగా టీవీల్లో వీక్షిస్తారని అంచనా. వచ్చే నెల 2న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లోనూ ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం కోసమే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ టికెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టికెట్ల ధరను అమాంతం పెంచేసి ఐసీసీ ఆదాయం పొందాలనుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

వచ్చే నెల 9న న్యూయార్క్‌లో జరిగే భారత్, పాక్‌ మ్యాచ్‌కు స్టేడియంలోని డైమండ్‌ క్లబ్‌ విభాగంలోని ఒక్కో సీటును 20 వేల అమెరికా డాలర్ల కు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే సుమారు 16 లక్షల.65 వేల రూపాయలు ఉంటుంది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఈ ప్రపంచకప్‌ను నిర్వహించడానికి ముఖ్య కారణం ఆటను విస్తరించడం, అభిమానులను సంపాదించుకోవడకోసమే కానీ టికెట్ల విక్రయాలపై లాభం పొందడం కోసం కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News