Lakshya Sen: లక్ష్యసేన్‍కు నిరాశ.. ఒలింపిక్స్ సెమీస్‍లో ఓటమి.. అయినా పతకం ఆశలు ఇంకా సజీవం

Lakshya Sen: లక్ష్యసేన్‍కు నిరాశ.. ఒలింపిక్స్ సెమీస్‍లో ఓటమి.. అయినా పతకం ఆశలు ఇంకా సజీవం

Update: 2024-08-04 13:16 GMT

Lakshya Sen: లక్ష్యసేన్‍కు నిరాశ.. ఒలింపిక్స్ సెమీస్‍లో ఓటమి.. అయినా పతకం ఆశలు ఇంకా సజీవం

Lakshya Sen: ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష‌్య సేన్ కీలక మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో 20-22, 14-21 తేడాతో డెన్మార్క్ షట్లర్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో ఫైనల్‌కు చేరి స్వర్ణం లేదా రజతం గెలుచుకునే అవకాశం చేజార్చుకున్నాడు. లక్ష్యసేన్ ఇప్పుడు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడినట్లు కనిపించిన లక్ష్యసేన్ తర్వాత పుంజుకున్నాడు. ఒకదశలో 15-11తో ఆధిక్యంలో నిలిచాడు. మరోవైపు అక్సెల్సెన్ క్రమంగా జోరు పెంచాడు. లక్ష్యసేన్ గేమ్ పాయింట్లు వృథా చేసుకున్నాడు. రెండో సెట్‌లో లక్ష్యసేన్‌ 7-0 భారీ ఆధిక్యం కనబరిచినా తర్వాత తేలిపోయాడు. డెన్మార్క్ షట్లర్ జోరు పెంచి పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

Tags:    

Similar News