IND vs NZ: తొలిరోజు వాష్ ఔట్.. మరి రెండో రోజు పరిస్థితి ఎలా ఉంటుంది? బెంగళూరు నుంచి కీలక అప్‌డేట్..

IND vs NZ Day 2 Rain Prediction: ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దైంది. ఈ సమయంలో టాస్ కూడా పడలేదు. బెంగళూరులో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వర్షం దాదాపు రోజంతా కొనసాగింది.

Update: 2024-10-16 16:17 GMT

IND vs NZ Day 2 Rain Prediction

IND vs NZ Day 2 Rain Prediction: ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దైంది. ఈ సమయంలో టాస్ కూడా పడలేదు. బెంగళూరులో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వర్షం దాదాపు రోజంతా కొనసాగింది. అంతకు ముందు కూడా వర్షం కారణంగా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయింది. మధ్యాహ్నం 2.30 గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు తొలిరోజు ఆటకు మైదానాన్ని సిద్ధం చేయలేమని అంగీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరుసటి రోజు ఆట మొదలవుతుందా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. తాజా వాతావరణ నివేదికను ఇప్పుడు తెలుసుకుందాం..

రెండో రోజు వాతావారణం ఎలా ఉందంటే?

బెంగళూరు టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు 5 రోజులకు బదులుగా 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు మిగిలిన రోజుల్లో ప్రతిరోజూ కనీసం 98 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. దీని కారణంగా, మ్యాచ్ కూడా ఉదయం 9:30 గంటలకు బదులుగా 9:15 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 9:45 గంటలకు జరుగుతుంది. ఉదయం సెషన్ 9:15 గంటలకు ప్రారంభమవుతుంది. 11:30 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం సెషన్ 12:10 నుంచి 2:25 వరకు ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీ సమయం ఉంటుంది. చివరి సెషన్ మధ్యాహ్నం 2:45 నుంచి 4:45 వరకు ఉంటుంది. సాయంత్రంలోగా ఓవర్ పూర్తి చేయకపోతే, ఆటను అరగంట పాటు పొడిగించవచ్చు.

రెండో రోజు కూడా వర్షం ఆటను పాడు చేస్తుందా?

మరుసటి రోజు మళ్లీ వర్షం పడే సూచన ఉంది. అంచనా ప్రకారం రెండో రోజు వర్షం పడే అవకాశం 41% ఉంది. అలాగే, మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం 25% ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) బెంగళూరుకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షపాతం, రోజంతా వర్షపు పరిస్థితులు కొనసాగవచ్చని హెచ్చరించింది. గంటకు 19 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఇది ఆటపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

WTC ఫైనల్‌లో కీలకం..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరేందుకు భారత్‌కు ఈ సిరీస్‌ చాలా కీలకం. న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే వచ్చే ఏడాది లార్డ్స్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాలు పెరుగుతాయి. అయితే, భారత జట్టు వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా ఆడుతుంది. అయితే, భారత్ న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేస్తే WTC ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమైనట్లే.

Tags:    

Similar News