IPL 2025 New Rules: బౌలర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. రూల్స్ మార్చేశారుగా!
భారత పేసర్ మొహమ్మద్ షమీ ఐసీసీకి సలైవా నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశాడు.

IPL 2025 New Rules: బౌలర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. రూల్స్ మార్చేశారుగా!
IPL 2025 New Rules: ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో విధించిన సలైవా నిషేధాన్ని ఎత్తివేసింది. ముంబైలో జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చి, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నిర్ణయం తీసుకోవడంతో, బౌలర్లు మళ్లీ సలైవా ఉపయోగించి బంతిని మెరుగుపర్చే అవకాశం పొందారు.
ఇటీవల భారత పేసర్ మొహమ్మద్ షమీ ఐసీసీకి సలైవా నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశాడు. 2011 నుంచి వన్డేల్లో ఒక్క ఇన్నింగ్స్కు రెండు బంతులు వాడుతుండటంతో, బంతి మునుపటిలా వేగంగా పాడవడం తగ్గిపోయింది. దీనికి తోడు సలైవా నిషేధం కారణంగా రివర్స్ స్వింగ్ సాధించడంలో బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. స్వింగింగ్ అనేది గాలి ఒత్తిడిలోని వ్యత్యాసంతో ఏర్పడే ప్రభావం. ఒకవైపు బంతి మెరుగుపరిచినప్పుడే వ్యత్యాసం ఏర్పడుతుంది. బౌలర్ బంతిని విడుదల చేసిన వెంటనే, దాని ఉపరితలంపై పలచని గాలి పొర ఏర్పడుతుంది. ఈ పొర ఏ సమయంలో, ఏ వైపున విరిగిపోతుందో ఆధారపడి గాలి ఒత్తిడి మారుతుంది. దీనివల్ల బంతికి స్వింగ్ కలుగుతుంది. బంతి ఒకవైపు మెరుగుపరిచినప్పుడు, గాలి ఒత్తిడి తక్కువగా ఏర్పడి, దిశ మార్పు సహజంగా జరుగుతుంది.
కరోనా సమయంలో ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సలైవా వినియోగంపై ఆంక్షలు విధించారు. అయితే, ఈ నిషేధంతో స్వింగ్ బౌలింగ్ ప్రభావితమైంది. ఇప్పుడు బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో, ఐపీఎల్లో పేసర్లు మరింత ప్రభావవంతంగా రివర్స్ స్వింగ్ చేయగలరని భావిస్తున్నారు. బంతిని మెరుగుపరిచే ఈ పద్ధతి తిరిగి వచ్చేయడంతో, బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లపై బౌలర్లు తక్కువ అవకాశాలు పొందుతున్న ఈ రోజుల్లో వారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని అనుకుంటున్నారు.