Avani Lekhara: 12 ఏళ్లకే పక్షవాతం.. కట్‌చేస్తే.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం.. భారత గోల్డెన్ గర్ల్ కథ వింటే కన్నీరే

Avani Lekhara: 12 ఏళ్లకే పక్షవాతం.. కట్‌చేస్తే.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం.. భారత గోల్డెన్ గర్ల్ కథ వింటే కన్నీరే

Update: 2024-08-30 16:06 GMT

Avani Lekhara: 12 ఏళ్లకే పక్షవాతం.. కట్‌చేస్తే.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం.. భారత గోల్డెన్ గర్ల్ కథ వింటే కన్నీరే

Avani Lekhara Story: పారిస్ పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవనీ లేఖరా చరిత్ర సృష్టించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పారాలింపిక్స్‌లో ఆమెకిది వరుసగా రెండో స్వర్ణం. టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లోనూ అవ్నీ స్వర్ణం సాధించింది. ఆమె గతంలో ప్యారిస్‌లో నెలకొల్పిన తన రికార్డును బద్దలు కొట్టి, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 ఈవెంట్‌లో కొత్త రికార్డుతో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అవ్నీ వరుసగా రెండు బంగారు పతకాలు సాధించడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, అభిరుచి ఉన్నాయి. చిన్నతనంలో ఘోర రోడ్డు ప్రమాదంలో పక్షవాతానికి గురై ఇప్పుడు స్వర్ణం సాధించే వరకు ఆమె చేసిన పోరాట కథ అందరికీ స్ఫూర్తిదాయకం.

12 ఏళ్ల వయసులో వీల్‌చైర్‌కు..

అవ్నీ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిది. 2012లో రోడ్డు ప్రమాదానికి గురై ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రోడ్డు ప్రమాదంలో ఆమె వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయి. దాని కారణంగా ఆమె పక్షవాతానికి గురైంది. ఆ తర్వాత ఆమె వీల్ చైర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. 12 ఏళ్ల చిన్న వయస్సులో ఇలా జరిగింది.

అడుగడుగునా నాన్న సపోర్ట్..

అవ్నీ తండ్రి కీలక పాత్ర పోషించాడు. శారీరకంగా, మానసికంగా క్రీడలను అన్వేషించమని ఆమెను ప్రోత్సహించారు. ఆమెకు శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ, క్రీడల పట్ల అవ్నీకి ఉన్న మక్కువ ఆమెను ఖచ్చితత్వం, ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరమయ్యే విలువిద్యను చేపట్టేలా చేసింది. అభినవ్ బింద్రా సాధించిన విజయాలతో ప్రేరణ పొందిన అవ్నీ 2015లో షూటింగ్‌లోకి ప్రవేశించింది. ఆమె అంకితభావం, ప్రతిభతోనే విజయానికి దారితీసింది. ఆమె జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గెలిచింది. జూనియర్‌, సీనియర్‌ స్థాయిలో ప్రపంచ రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది.

శిక్షణతో పాటు చదువు..

క్రీడలపై అమితమైన మక్కువ ఉన్న అవ్నీ శిక్షణతోపాటు చదువును కొనసాగించింది. బిజీ ట్రైనింగ్ షెడ్యూల్‌తో పాటు, అవ్నీ రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో 5 సంవత్సరాల లా డిగ్రీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ తీసుకుంది. ఈ దశ ఏదైనా చేయాలనే ఆమె నైపుణ్యం, అభిరుచిని చూపుతుంది. వీటన్నింటితో పాటు, 2021 పారాలింపిక్స్‌లో స్వర్ణాన్ని లక్ష్యంగా చేసుకుంది. దీంతో అవ్నీ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

రెండు పతకాలు..

గతసారి టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో అవ్నీ ఒకటి కాదు రెండు పతకాలు సాధించింది. షూటింగ్‌లోనే తొలి స్వర్ణం, ఆ తర్వాత కాంస్య పతకం సాధించింది. ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్‌గా నిలిచింది. దేశమంతటా విజయ ధ్వనులు వినిపించాయి. ఈ అద్భుతమై విజయానికి, అవ్నీ పద్మశ్రీ, ఖేల్ రత్న వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో కూడా సత్కరించారు.

చారిత్రాత్మక విజయంపై సంతోషం..

పారిస్‌లో చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన అనంతరం అవ్నీ మాట్లాడుతూ, 'ఈ ఫైనల్ ఎంతో ఉత్కంఠగా సాగింది. మొదటి, రెండవ, మూడవ స్థానాలకు చాలా తక్కువ వ్యత్యాసం ఉంది. కానీ, నేను ఫలితాల కంటే నా ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించాను. నేను ఇంకా రెండు ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంది. అందుకే దేశం కోసం మరిన్ని పతకాలు సాధించడంపై దృష్టి పెట్టాను' అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News