లావణ్య- హీరో రాజ్తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్
లావణ్య-హీరో రాజ్తరుణ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
లావణ్య-హీరో రాజ్తరుణ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్యపై ప్రీతి, ఉదయ్ ఫిర్యాదు చేశారు. తమకు డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్యేనంటూ కంప్లయింట్ ఇచ్చారు. లావణ్య నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు.
లావణ్య ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోందని రాజ్తరుణ్ తరఫు లాయర్ మధుశర్మ ఆరోపించారు. డ్రగ్స్ ఎంకరేజ్ చేయకపోవడంతోనే రాజ్తరుణ్పై కక్ష పెంచుకుందన్నారు. డ్రగ్స్ విషయంలో చాలామందిని లావణ్య ఇబ్బంది పెడుతోందని, పూర్తి ఆధారాలు మూడు రోజుల్లో పోలీసులకు అందజేస్తామని చెప్పారు లాయర్ మధుశర్మ.