Telangana: పంటరుణమాఫీ నిధులు జూలై 18న రైతుల ఖాతాల్లోకి

Telangana: పంటరుణమాఫీ నిధులు జూలై 18న రైతుల ఖాతాల్లోకి

Update: 2024-07-16 11:57 GMT

Telangana: పంటరుణమాఫీ నిధులు జూలై 18న రైతుల ఖాతాల్లోకి

పంట రుణమాఫీకి సంబంధించి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జూలై 18న నగదును జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. పంట రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను జూలై 15న ప్రభుత్వం విడుదల చేసింది. రుణమాఫీ డబ్బులు విడుదలైన రోజునే రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు జరుపుకోనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు,ప్రజాప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొంటారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం.

Tags:    

Similar News