Yusuf Pathan: అల్లర్ల మధ్యే ఇన్స్టాగ్రామ్లో యూసుఫ్ పఠాన్ 'గుడ్ ఛాయ్' పోస్ట్... ఏకిపారేస్తున్న బీజేపి

Yusuf Pathan: అల్లర్ల మధ్యే ఇన్స్టాగ్రామ్లో యూసుఫ్ పఠాన్ 'గుడ్ ఛాయ్' పోస్ట్... ఏకిపారేస్తున్న బీజేపి
Yusuf Pathan's Good Chai Post gets huge backlash: మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన యూసుఫ్ పఠాన్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టి విమర్శల పాలయ్యారు. మధ్యాహ్నం పూట ఛాయ్ తాగుతూ ఫోటోలు దిగిన యూసుఫ్ పఠాన్, ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. మధ్యాహ్నం మంచి వాతావణంలో ఛాయ్ ఎంజాయ్ చేస్తున్నాను అని ఆ పోస్టులో పేర్కొన్నారు. పఠాన్ పెట్టిన ఆ పోస్టు ఆయన్ను ఊహించని విధంగా రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శల పాలయ్యేలా చేసింది.
గత వారం రోజులుగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో హింసాత్మక వాతావరణం నెలకొని ఉంది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ధర్నాలకు దిగుతున్నారు. కొన్నిచోట్ల ఈ ధర్నాలు హింసాత్మకంగా మారి ముగ్గురి ప్రాణాలు తీశాయి. అల్లర్లు జరుగుతున్న ప్రాంతం యూసుఫ్ పఠాన్ లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బహరాంపూర్ నియోజకవర్గం పరిధిలోకి రాకపోయినప్పటికీ, ఆ నియోజకవర్గానికి అతి దగ్గర్లోనే అల్లర్లు జరుగుతున్నాయి.
అయితే, నియోజకవర్గం చుట్టూ విధ్వంసం జరుగుతుంటే, ఆయన మాత్రం ఆ అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా గుడ్ ఛాయ్ అని ఛాయ్ ఎంజాయ్ చేస్తూ పోస్ట్ పెడతారా అని బీజేపి మద్దతుదారులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Bengal is burning
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) April 13, 2025
HC has said it can’t keep eyes closed and deployed centra forces
Mamata Banerjee is encouraging such state protected violence as Police stays silent!
Meanwhile Yusuf Pathan - MP sips tea and soaks in the moment as Hindus get slaughtered…
This is TMC pic.twitter.com/P1Yr7MYjAM
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పి అల్లర్లు జరుగుతుంటే, ఒక బాధ్యత కలిగిన ఎంపీగా యూసుఫ్ పఠాన్ నడుచుకునే వైఖరి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
Most read interesting news stories: జనం ఎక్కువగా చదివిన వార్తా కథనాలు
- మరో వారం రోజుల్లో బిడ్డకు పెళ్లి పెట్టుకుని కాబోయే అల్లుడితో అత్త జంప్
- రిటైర్మెంట్ రోజు లాస్ట్ ట్రిప్కు వెళ్లిన లోకో పైలట్... సిగ్నల్ వద్ద రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు
- Why Nifty IT falling? సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా పేరున్న ఐటి కంపెనీల స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రానున్నది గడ్డు కాలమేనా?
- Indian students in US: అమెరికాలో కొత్త బిల్లు... వణికిపోతున్న 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్
- పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ... ఈ రూట్లో ఇండియా నుండి శ్రీలంక ఎలా వెళ్తారంటే..