Xiaomi SU7: ఫుల్ ఛార్జ్‌తో 800కిమీల మైలేజీ.. భారత మార్కెట్‌లో విడుదలకు సిద్ధమైన షియోమీ ఈవీ కార్.. ధరెంతంటే?

Xiaomi SU7: ఫుల్ ఛార్జ్‌తో 800కిమీల మైలేజీ.. భారత మార్కెట్‌లో విడుదలకు సిద్ధమైన షియోమీ ఈవీ కార్.. ధరెంతంటే?

Update: 2024-07-07 13:30 GMT

Xiaomi SU7: ఫుల్ ఛార్జ్‌తో 800కిమీల మైలేజీ.. భారత మార్కెట్‌లో విడుదలకు సిద్ధమైన షియోమీ ఈవీ కార్.. ధరెంతంటే?

Xiaomi Electric Car: స్మార్ట్‌ఫోన్ తయారీదారు Xiaomi ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో తన ఉనికిని నమోదు చేయబోతోంది. సమాచారం ప్రకారం, Xiaomi త్వరలో భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. ఈ కారు పేరు Xiaomi SU7. ఈ కారు 800 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ పొందబోతోంది.

Xiaomi కొత్త ఎలక్ట్రిక్ కారు..

Xiaomi తన కొత్త ఎలక్ట్రిక్ కారును 4 విభిన్న వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇందులో ఎంట్రీ లెవల్ మోడల్ నుంచి లిమిటెడ్ ఫౌండర్స్ మోడల్ వరకు అన్నీ అందివ్వనుంది. ఇది కాకుండా, ఈ కారు డిజైన్ చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. Xiaomi ఎలక్ట్రిక్ కారు పొడవు 4997 mm, ఎత్తు 1455 mm, వెడల్పు 1963 mmలుగా ఉండనుంది.

బలమైన బ్యాటరీ ప్యాక్..

Xiaomi కొత్త ఎలక్ట్రిక్ కారును రెండు బ్యాటరీ ప్యాక్‌లతో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ కారు ఎంట్రీ లెవల్ వేరియంట్ 73.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందించనుంది. దీని టాప్ మోడల్ 101 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఎంట్రీ లెవల్ వేరియంట్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌పై 700 కి.మీల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది.

మరోవైపు, టాప్ మోడల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 810 కిమీ వరకు నడపవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ కారు గరిష్టంగా గంటకు 265 కి.మీ.ల వేగంతో దూసుకపోతుందని తెలిపింది. కంపెనీ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 2.78 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదంట.

ఎంత ఖర్చు అవుతుందంటే..

Xiaomi ఎలక్ట్రిక్ కారు Xiaomi SU7 9 జులై 2024న భారతదేశంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

కానీ, చైనాలో విడుదల చేసిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.24.90 లక్షలుగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో, కంపెనీ ఈ కారును భారతదేశంలో దాదాపు రూ. 25 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరతో విడుదల చేయగలదని భావిస్తున్నారు. అయితే, ఇది కారు లాంచ్‌తో ధృవీకరణకానుంది.

Tags:    

Similar News