Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయింది

Kishan Reddy: భూములు కనిపిస్తే ఆక్రమిస్తున్నారు.. వేలం వేస్తున్నారు

Update: 2023-08-15 05:38 GMT

Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయింది

Kishan Reddy: మరోసారి కేసీఆర్‌ కుటుంబం అధికారంలోకి వస్తే.. తెలంగాణ అధోగతి పాలవుతుందని విమర్శించారు కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి. భూములు కనిపిస్తే ఆక్రమిస్తున్నారని, వేలం వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ధరణి పేరుతో రైతుల పొట్ట గొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శనాస్త్రాలు సంధించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయ్యిందని విరుచుకుపడ్డారు. తెలంగాణ బీజేపీ ఆఫీస్‌లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. దేశ రక్షణలో అమరులైన వీరా రాజారెడ్డి తల్లిదండ్రులను సత్కరించారు కిషన్‌రెడ్డి.

Tags:    

Similar News