TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు.. టీఎస్ ఆర్టీసీ శుభవార్త
TSRTC: ఈనెల 30 లోపు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే అవకాశం
TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకుంటే ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇవ్వనుంది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణించే వారు ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. 10శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈనెల 30 లోపు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.