మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత
మంచిర్యాల జిల్లాలో మోహరించిన కేంద్ర బలగాలు
Mancherial: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఎన్నికల అధికారులు ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను మోహరించారు. ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ కొనసాగుతుంది. 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. దీంతో నాలుగు గంటల లోపే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకునేల ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు.