Harish Rao: దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
Harish Rao: లక్షా 30వేల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయం
Harish Rao: తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో లక్షా 30 వేల కుటుంబాలకు దళితబంధు ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్రావు తెలిపారు. అలాగే గృహలక్ష్మీ పథకం ద్వారా 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వమే 3 లక్షల రూపాయలు ఇస్తుందని.. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.