రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ: రేవంత్ రెడ్డి

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. 43 లక్షల మందికి రూ. 500లకే గ్యాస్ సిలిండర్ తో లబ్ది కలుగుతుందన్నారు సీఎం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. భద్రాద్రి సీతారాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్ళను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. త్వరలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

Update: 2024-08-15 05:06 GMT

Linked news