తప్పుడు ఆరోపణలు చేస్తున్నా సంయమనం పాటిస్తున్నాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ కరీంనగర్ లో మాటిచ్చారని...ఈ మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మాట ఇస్తే అమలు చేస్తారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ నిరూపించిందని ఆయన చెప్పారు.

దశాబ్దకాలం తర్వాత నిజమైన ప్రజా పాలన తెలంగాణలో ప్రారంభమైందని ఆయన చెప్పారు. తొలిసారిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్దమైన పాలన సాగుతోందన్నారు. ప్రజల స్వేచ్ఛను పునరుద్దరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.

పాలనలో లోటుపాట్లుంటే సూచనలు ఇచ్చేలా చేశామన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నా సంయమనం పాటిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రజా పాలన మొదలయ్యాక కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పదేళ్లపాటు రాష్ట్ర గీతం లేకుండా పాలన చేశారన్నారు. జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Update: 2024-08-15 04:59 GMT

Linked news