మెగా డిఎస్సీ ఫైలుపై తొలి సంతకం: చంద్రబాబు

విభజన కంటే రివర్స్ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ అసమర్ధ విధానాలతో రాష్ట్రం అప్పులు రూ. 9 లక్షల 74వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించినట్టుగా ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే ఐదు సంతకాలు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ప్రజల కష్టాలను చూసి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టుగా తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రోజునే మెగా డీఎస్సీపై సంతకం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Update: 2024-08-15 04:45 GMT

Linked news