ప్రశ్నిస్తే దాడులు, కేసులు: జగన్ పాలనపై చంద్రబాబు

గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు విధ్వంసం సృష్టించారన్నారు. బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని చంద్రబాబు విమర్శించారు. నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ భూములు, ఆస్తులను దోచుకున్నారన్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో వేధించారని చెప్పారు. ప్రజావేదిక ధ్వంసంతో నాటి పాలనను జగన్ ప్రారంభించారన్నారు. నాటి విధ‌్వంసపాలనలో సంపద సృష్టి లేదన్నారు.

Update: 2024-08-15 04:39 GMT

Linked news