నెహ్రూ దార్శనికతతో అభివృద్ది వైపు దేశం పయనం: రేవంత్ రెడ్డి



గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో నిలిచిందన్నారు. పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ది వైపునకు నడిపించడంలో ఆయన ముందున్నారన్నారు. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతో దేశం సస్యశ్యామలంగా ఉందని ఆయన చెప్పారు. బీహెచ్ఈఎల్, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించారన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీలు సాగులో విప్లవం తెచ్చారని ఆయన గుర్తు చేశారు.

Update: 2024-08-15 04:53 GMT

Linked news