Telangana: కాసేపట్లో ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం

TPCC executive meeting at Praja Bhavan shortly
x

Telangana: కాసేపట్లో ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం

Highlights

Telangana: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం

Telangana: కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో ఈ మీటింగ్ జరగనుంది.ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న టీ పీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశముంది. ప్రధానంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై హస్తం నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రేపు లక్ష వరకు రైతు రుణమాఫీ కానున్న నేపథ్యంలో..రుణమాఫీ సంబరాలను పార్టీపరంగా ఎలా నిర్వహించాలో.. నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపైనా చర్చించే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories