Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట

Battalion constable in Telangana
x

Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట

Highlights

Telangana News: కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో సెలవుల రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో సెలవుల రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రంలో గతంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల 15 రోజులకు ఒకసారి సెలవుపై వేళ్ల అవకాశం ఉండేది. కానీ, ఈ నిబంధనను మార్చారు.

కొత్త లీవ్ మాన్యువల్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త జీవోను విడుదల చేశారు. దీంతో 15 రోజులకు సెలవుపై వెళ్లాల్సిన కానిస్టేబుళ్లు 26 రోజులకు సెవలుపై వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఈ నిబంధనను నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తొలుత నల్గొండ, ఆ తర్వాత ఆదిలాబాద్ ఇలా వరుసగా పలు జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి.

శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ను కానిస్టేబుల్ కుటుంబసభ్యులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం సెలవుల విషయంలో ఇటీవల జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories