రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. కేసీఆర్‌ స్థానంలో మోడీకి స్వాగతం పలకనున్న ఆ మంత్రి..

Talasani Srinivas Yadav to Welcome Pm Modi
x

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. కేసీఆర్‌ స్థానంలో మోడీకి స్వాగతం పలకనున్న ఆ మంత్రి..

Highlights

PM Narendra Modi: సమతామూర్తి విగ్రహావిష్రణ నేపధ్యంలో.. రేపు ప్రధాని మోడీ హైదరాబాద్‌ రానున్నారు.

PM Narendra Modi: సమతామూర్తి విగ్రహావిష్రణ నేపధ్యంలో.. రేపు ప్రధాని మోడీ హైదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్నారు మోడీ. హెలిపాడ్‌లో దిగిన తర్వాత సమీపంలోని అతిథి గృహానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా యాగశాలకు వెళ్తారు మోడీ. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకుని విశ్వక్‌సేనుడి పూజ నిర్వహిస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుని, 108 దివ్యదేశాలతోపాటు భద్రవేది మొదటి అంతస్తులోని స్వర్ణమయ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు మోడీ. ఆ తర్వాత సమతామూర్తి విగ్రహావిష్కరణ చేస్తారు.

ప్రోటోకాల్ ప్ర‌కారం సీఎం కేసీఆర్ స్వాగ‌తం ప‌ల‌కాలి. కానీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ సీఎం స్థానంలో వెల్ క‌మ్ చెబుతార‌ని సీఎంవో వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. అయితే ప్రధాని మోదీకి స్వాగతం చెప్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకుండా మంత్రి తలసానిని పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




Show Full Article
Print Article
Next Story
More Stories