Revanth Reddy: జాతీయ జెండా ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ రుణమాఫీ..

Revanth Reddy Targets KCR Independence Day
x

Revanth Reddy: జాతీయ జెండా ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ రుణమాఫీ.. 

Highlights

Revanth Reddy: కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడింది

Revanth Reddy: ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ భవన్‌లో రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ వల్లే రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై తాము వచ్చాక సమీక్షిస్తామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని...10వేల ఎకరాలు దోచుకుందని ఆరోపించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి 5లక్షలు అందిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories