Revanth Reddy: జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది.. త్వరలోనే కొత్త పీసీసీ..

Revanth Reddy Press Meet in Delhi
x

Revanth Reddy: జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది.. త్వరలోనే కొత్త పీసీసీ..

Highlights

Revanth Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

Revanth Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఇవాళ ఉదయం సీఎం రేవంత్‌తో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో నెలకొన్న గందరగోళంపై ఇరువురి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. కాంగ్రెస్‌ కోసం జీవన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ చేరిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందని రేవంత్‌ అన్నారు. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అన్న రేవంత్ జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలో ఏ శాఖా ఖాళీగా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.. అన్ని శాఖలకు సమర్ధమైన మంత్రులు ఉన్నారన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర్ర అభివృద్ధి ద్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విద్యుత్ పై విచారణ కమిషన్ ను తాము ప్రతిపాదించలేదన్నారు. త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నిమిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories