Raghunandan Rao: కేసీఆర్‌పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..

Raghunandan Rao Comments On KCR And Harish Rao
x

Raghunandan Rao: కేసీఆర్‌పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..

Highlights

Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని ఆయన అన్నారు.

Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని ఆయన అన్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని.. మెదక్‌లో నిర్వహించిన సన్మాన సభలో వ్యాఖ్యానించారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ళ పండుగ అన్నారు రఘునందన్ రావు.

తన సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని, రఘునందన్ అంటే మాటల మనిషి కాదు..చేతల మనిషి అని ఆయన అన్నారు. పైసలు, మందు ఓపెన్‌గా పంచినా ఓడిపోయారని ఎన్నికలను ప్రస్తావించారు. వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచానని, రాజకీయాల్లో రాణించాలంటే ఆత్మ విశ్వాసం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories