Nalgonda: వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని పాపను చంపిన తల్లి

Mother Killed 2Years Child in Narketpalle
x

Nalgonda: వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని పాపను చంపిన తల్లి

Highlights

Nalgonda: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో చిన్నారి మృతి కేసులో వీడిన మిస్టరీ

Nalgonda: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని కన్న కూతురినే చంపిన కసాయి తల్లి హతమార్చిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టలో జరిగింది. ఉయ్యాల రమ్య అనే మహిళకు రెండు సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో అప్పటి నుంచి తన పాపతో కలిసి ఎలికట్టలో ఉంటుంది. గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన పెరిక వెంకన్నతో కలిసి సహజీవం చేస్తోంది. అయితే, వీరి సహజీవనానికి కుమార్తె అడ్డు వస్తుందని ప్రియుడితో కలిసి కన్న కూతురినే హత్య చేసింది రమ్య. మొదట గోడకేసి గట్టిగా కొట్టింది. తర్వాత పాప ముక్కు, నోరు మూసి హత్య చేసింది. చిన్నారి మృతిపై నాయనమ్మ అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమ్యతో పాటు ప్రియుడు వెంకన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories