Tata Madhu: ఎవరైనా ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేయాలి

MLC Tata Madhu Hot Comments
x

Tata Madhu: ఎవరైనా ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేయాలి

Highlights

Tata Madhu: ఏ అధికారైనా మనం చెప్పినట్లే పని చేయాలి

Tata Madhu: ఎమ్మెల్సీ తాతా మధు హాట్‌ కామెంట్స్‌ చేశారు. గులాబీ కండువా కప్పుకున్నోడికే ప్రభుత్వ స్కీమ్‌ అందుతుందని, ఏ అధికారైనా మనం చెప్పినట్లే పని చేయాలని అన్నారు తాతా మధు. ఎందుకంటే ప్రభుత్వం మనది.. ఎవరైనా ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేయాలని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ అంతర్గత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాతా మధు ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా తాతా మధు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఈ కామెంట్స్‌ చేశారు. అయితే.. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాతా మధు కామెంట్స్‌పై ప్రతిపక్షాలు, స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. తాతా మధుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories