KTR: రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు..?
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల..? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల.. కాంగ్రెస్ వల్ల కాదా అంటూ ఫైరయ్యారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని.. హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై.. సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరంటూ ప్రశ్నించారు.
తొలిదశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా.. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో.. తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది కాంగ్రెస్ కాదా అంటూ విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాస్వామికంగా.. తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి.. వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరంటూ కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు.. వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత కాంగ్రెస్ కాదా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్.
తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల?
— KTR (@KTRBRS) May 31, 2024
1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు?
❌… pic.twitter.com/lsI2NMuCjm
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire