KTR: కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ

KTR Slams Revanth Reddy on Musi Riverfront Project
x

KTR: కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ

Highlights

KTR: కమీషన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ అంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

KTR: కమీషన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ అంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ పేరు మీద.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ‌‌, రాబర్ట్ వాద్రాలు డబ్బులు పంచుకుంటారని ఆయన ఆరోపించారు.సంక్షేమ పథకాల అమలుకు లేని డబ్బులు మూసీ సుందరీకరణకు ఎక్కడివని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు అల్లావుద్దీన్ పటేల్‌కి.. కండువా కప్పి పార్టీలోకి ఆ‌హ్వానించారు కేటీఆర్. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోన్న కాంగ్రెస్‌కు హర్యానా ప్రజలు బుద్ది చెప్పారన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొండగల్ లో రైతల భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపణలు గుప్పించారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories