KTR: దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న మక్కువ.. గాంధీలో రోగులపై లేకపాయే..

KTR Fires on CM Revanth Reddy in Twitter
x

KTR: రేవంత్‌రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ+అదానీ.. వాళ్ల బడేభాయ్ ఆజ్ఞను మాత్రం..

Highlights

KTR: రేవంత్‌ సర్కార్‌పై ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.

KTR: రేవంత్‌ సర్కార్‌పై ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. గాంధీ ఆస్పత్రిని ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన ఆయన.. నాడు, నేడు, ఎల్లప్పుడూ కాంగ్రెస్‌ పాలనలో ఉందంటే.. నేను పోను బిడ్డో.. సర్కారు దవాఖానాకు అనే మాటలే వినిస్తాయంటూ ట్వీట్‌ చేశారు. గాంధీని గాలికి వదిలి - గాల్లో చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్‌ అంటూ పోస్ట్‌ పెట్టారు.

మద్యం ధరల పెంపుపై ఉన్న మక్కువ.. మందుబిళ్లలపై లేకపాయే అంటూ కేటీఆర్‌ విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఉన్న మక్కువ.. గాంధీలో మంచినీళ్లపై లేకపాయే.. మూసీపై ఉన్న మక్కువ.. గాంధీలో వీల్‌ చైర్లపై లేకపాయే.. ఫోర్‌ బ్రదర్స్‌ సిటీపై ఉన్న మక్కువ.. గాంధీలో విరేచనాల మందులపై లేకపాయే అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న మక్కువ.. గాంధీలో రోగులపై లేకపాయే.. అదానీ అంబుజా సిమెంట్‌పై ఉన్న మక్కువ.. గాంధీలో బెటాడిన్‌ బిళ్లలపై లేకపాయే.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories