KTR: నీట్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్
![](/images/authorplaceholder.jpg?type=1&v=2)
![ktr open letter central government neet exam ktr open letter central government neet exam](https://assets.hmtvlive.com/h-upload/2024/06/16/375682-ktr-1.webp)
KTR: నీట్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్
KTR: విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదు
KTR: వైద్యవిద్య చదవాలన్న విద్యార్థుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని ఫైర్ అయ్యారు. ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.
🔷నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేటీఆర్
— BRS Party (@BRSparty) June 16, 2024
🔷లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం
🔷ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన
🔷పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర… pic.twitter.com/agUwEuiaG8
![](/images/logo.png)
About
![footer-logo](/images/logo.png)
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire