KTR: మహబూబ్‌నగర్​పట్టణంలో పలు నిర్మాణాల కూల్చివేతలపై స్సందించిన కేటీఆర్

KTR
x

KTR

Highlights

KTR: కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసిన కేటీఆర్

KTR: మహబూబ్​నగర్​పట్టణంలో పలు నిర్మాణాల కూల్చివేతలపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణను మరో "బుల్డోజర్ రాజ్ " కానివొద్దని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం, చట్టాలనూ ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని ఖర్గేను కోరారు. ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చటం అమానవీయం.

అన్యాయం అంటూ గతంలో మీరే అన్నారని ఖర్గేను ఎక్స్​లో ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వం కూల్చేసిన 75 కుటుంబాల ఇళ్లలో 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని ఖర్గేకు తెలిపారు కేటీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories