KCR: రైతులకు వెన్నుపోటు పొడిచారు.. ఈ బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది

KCR Reaction on Telangana Budget 2024-25
x

KCR: రైతులకు వెన్నుపోటు పొడిచారు.. ఈ బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది

Highlights

KCR: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాజకీయ ప్రసంగంలా ఉందన్నారు మాజీ సీఎం కేసీఆర్.

KCR: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాజకీయ ప్రసంగంలా ఉందన్నారు మాజీ సీఎం కేసీఆర్. బడ్జెట్‌ సమావేశాల అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని కేసీఆర్‌ విమర్శించారు.

రైతులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని.. పాత పాలసీలే తప్ప కొత్తగా ఏం చేస్తామో ప్రస్తావించలేదని విమర్శించారు కేసీఆర్. అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories