Congress: ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ

Jeevan Reddy Meet Revanth Reddy in Delhi
x

Congress: ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ

Highlights

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ పుట్టించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ పుట్టించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర మనస్థాపం చెందిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం నేతల పిలుపుతో హస్తిన చేరుకున్నారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవడంపై ఉన్న అసంతృప్తిని విన్నవించుకున్నారు.

కాంగ్రెస్ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్న జీవన్ రెడ్డి.. పార్టీ కోసం కష్టపడి పని చేస్తానన్నారు. తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అరగంట పాటు చర్చలు జరిపారు. కాసేపట్లో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జీవన్ రెడ్డి హైదరాబాద్ బయల్దేరి రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories