Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు చంపేశారు

Hyderabad Hotel Staff Beat Customer to Death
x

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు చంపేశారు

Highlights

Hyderabad: ఎక్స్‌ట్రా పెరుగు అడిగాడని కస్టమర్ పై దాడి చేసిన సిబ్బంది

Hyderabad: హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. ఎక్స్‌ట్రా పెరుగు అడిగారని లియాకత్ అనే కస్టమర్ పై దాడి చేశారు మెరిడియన్ హోటల్ సిబ్బంది.. దీంతో ఇరువురిని పొలీస్ స్టేషన్ కు తరలించారు పంజాగుట్ట పోలీసులు. స్టేషన్ లో మాట్లాడుతుండగానే సృహకోల్పోయాడు లికాయత్.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు లియాకత్. దీంతో డెక్కన్ హాస్పిటల్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories