ఉప్పల్ భగాయత్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు.. ఏం జరిగిందో తెలుసా?

Hooligans Doing This In Hyderabad Uppal Bhagayath
x

ఉప్పల్ భగాయత్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు.. ఏం జరిగిందో తెలుసా?

Highlights

Hyderabad: హైదరాబాద్‌ ఉప్పల్‌ భగాయత్‌లో పోకిరీల ఆగడాలు శృతి మించాయి. రాత్రివేళ భగాయత్‌కు వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్‌ ఉప్పల్‌ భగాయత్‌లో పోకిరీల ఆగడాలు శృతి మించాయి. రాత్రివేళ భగాయత్‌కు వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు. బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు నిందితులు. అయితే వీరికి పోలీసులు వత్తాసు పలుకుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఓ జంట నుంచి 3 లక్షలు డిమాండ్‌ చేశారు నిందితులు.

అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. రాజీ చేసుకోవాలని సూచించారు. దీంతో బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నలుగురు నిందితులు అమరేందర్‌, నక్క సాయి చరణ్‌, అబ్బు, మారుతీని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైపై వేటు వేశారు. డీసీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉన్నతాధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories