Hyderabad: పెట్రోల్‌ పోస్తుండగా నిప్పుపెట్టిన ఆకతాయి.. ఆ తరువాత ఏమైందంటే?

Fire Accident in Petrol Bunk in Nacharam
x

Hyderabad: పెట్రోల్‌ పోస్తుండగా నిప్పుపెట్టిన ఆకతాయి.. ఆ తరువాత ఏమైందంటే?

Highlights

Hyderabad: నాచారం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పడుతుండగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు.

Hyderabad: నాచారం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పడుతుండగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది నిప్పును ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.

నాచారం పోలీస్​ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వాహనదారులతో రద్దీగా ఉంది. బంక్ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ సమయంలో స్కూటీపై వచ్చిన యువకులు పెట్రోలు కావాలన్నారు. సిబ్బంది పెట్రోల్ నింపుతుండగా అందులో ఓ యువకుడు ఒక్కసారిగా జేబులో ఉన్న లైటర్​ తీసి నిప్పంటించాడు. అంతే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ దెబ్బకు అక్కడ ఉన్న వాహనదారులంతా తలోదిక్కుకు పరుగులు తీశారు. అయినా అంతటితో ఆగని ఆ ఆకతాయి, నిప్పు చెలరేగుతుండగానే దానిని మరోవైపు కాలితో నెట్టుతూ పైశాచిక ఆనందం పొందాడు.

తీవ్ర భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్‌ ఫోమ్‌తో మంటలు ఆర్పివేశారు. దీంతో పెట్రోల్‌ బంక్‌లో ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా..చందన్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories