Mancherial: ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య.. నాలుగేళ్ల తర్వాత జాబ్ కాల్​ లెటర్..

Call Letter for Last Test of a Job to Died Man in Mancherial
x

Mancherial: ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య.. నాలుగేళ్ల తర్వాత జాబ్ కాల్​ లెటర్..

Highlights

Mancherial: మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం కోసం నిర్వహించే చివరి పరీక్షకు హాజరుకావాలని కాల్‌లెటర్ వచ్చింది.

Mancherial: మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం కోసం నిర్వహించే చివరి పరీక్షకు హాజరుకావాలని కాల్‌లెటర్ వచ్చింది. మందమర్రికి చెందిన జీవన్‌కుమార్ 2018లో జూనియర్ లైన్‌మన్ పరీక్ష రాశాడు. మిగులు పోస్టుల విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది.

తాజాగా మెరిట్ ఆధారంగా భర్తీకి అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్షకు ఈ నెల 24న రావాలంటూ జీవన్‌కు కాల్ లెటర్ వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం రాకపోవడంతో జీవన్ 2020లోనే సూసైడ్ చేసుకున్నాడు. కాగా లెటర్‌ను పోస్ట్‌మ్యాన్ వెనక్కి పంపించేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories